కమిటీ విధివిధానాలపై చెప్పలేదు: సిఎం

కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని వేసినందున రాష్ట్రంలో శాంతికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. పిల్లల చదువులకు ఆటంకాలు వద్దని ఆయన అన్నారు. ఏ పేరుతో ఎక్కడ ఉద్యమం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు గండి పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని, కాంగ్రెసు నాయకత్వం అందుకు తగిన సమయం వచ్చిందని అనుకున్నప్పుడు అది జరుగుతుందని ఆయన అన్నారు. తాను అవసరం ఉందని అనుకున్నప్పుడు నాయకత్వాన్ని అడిగి అందుకు చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో వేసిన కమిటీ అవసరం ఉందా, లేదా పరిశీలిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications