ధరలను త్వరలోనే స్థిరీకరిస్తాం: ప్రధాని

ఎన్డీయె హయాంలో కూడా ధరలు పెరిగాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ ధరల పెరుగుదల ప్రభావం మన దేశంపై కూడా పడిందని ఆయన అన్నారు. ఎగుమతులను నిరుత్సాహపరుస్తున్నామని, అవసరమైతే నిషేధిస్తామని ఆయన తెలిపారు. అధిక దిగుబడులు చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ఆయన చెప్పారు. పంచదార ధరలను నియంత్రించడానికి ముడి పంచదార దిగుమతిని అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన అన్నారు. దీన్ని సమూలంగా మార్చాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications