కాంగ్రెసు సమన్వయ కమిటీలో జగన్

YS Jagan
న్యూఢిల్లీ: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేసేందుకు రాష్ట్రంలో కాంగ్రెసు అధిష్టానం ఒక సమన్వయ కమిటీని వేసింది. ఈ సమన్వయ కమిటీలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు స్థానం కల్పించారు. ఈ కమిటీకి పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ నేతృత్వం వహిస్తారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా ఈ కమిటీలో ఉంటారు. కమిటీ సభ్యులుగా తెలంగాణ నుచంి ముగ్గురిని, సీమాంధ్ర నుంచి ముగ్గురిని వేశారు. వైయస్ జగన్ తో పాటు కెవిపి రామచందర్ రావు, కావూరి సాంబశివరావు సీమాంధ్ర నుంచి, గీతా రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ తెలంగాణ నుంచి కమిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.

రాష్ట్ర విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వేసిన నేపథ్యంలో ఈ సమన్వయ కమిటీని వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే, శాసనసభా సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ స్థితిలో పార్టీ నాయకులు, శాసనసభ్యులు అంతా ఏకతాటి మీద ఉండేందుకు వీలుగానే ఈ కమిటీని వేసినట్లు తెలుస్తోంది. గతంలో ఒకసారి ఇటువంటి సమన్వయ కమిటీని వేసినప్పటికీ డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడైన తర్వాత అది జాడ లేకుండా పోయింది. రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి పార్టీ శాసనసభ్యులంతా ఒక తాటి మీద ఉన్న జాడలు కనిపించలేదు. వైయస్ జగన్ వర్గం ఏదో రకంగా రోశయ్యను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగుతూ వచ్చింది. జగన్ ను, కెవిపిని సమన్వయ కమిటీలో వేయడం శాసనసభ సమావేశాలు సజావుగా జరగడానికేనని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+