వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్కన్ చార్జర్స్ ను ఆడనివ్వం: కోమటిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Komitireddy Venkat Reddy
హైదరాబాద్: ఐపియల్ ఆరంభ మ్యాచ్ హైదరాబాదులో పెట్టకపోతే దక్కన్ చార్జర్స్ ను మ్యాచులను ఆడనివ్వమని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పారు. సాకులు చూపి ఆరంభ మ్యాచును ముంబైకి తరలిస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఆరంభ మ్యాచు హైదరాబాదులో జరగకపోతే దక్కన్ చార్జర్స్ ను అడనివ్వబోమని ఆయన అన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

హైదరాబాదులో ముందు ఖరారు చేసిన ప్రకారం నాలుగు ఐపియల్ మ్యాచులు, విశాఖపట్నంలో రెండు మ్యాచులు జరగాలని ఆయన అన్నారు. ఐపియల్ ఆరంభ మ్యాచును హైదరాబాదులో నిర్వహించాలని ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ను కూడా కోరారని ఆయన గుర్తు చేశారు. తాను ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X