వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో మరింత జాప్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Srikrishna
న్యూఢిల్లీ: రాష్ట్ర పరిస్థితిపై వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. గురువారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఖరారవుతాయని విరివిగా ప్రచారం జరిగింది. అయితే తెలంగాణపై గానీ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై గానీ ఏ విధమైన చర్చ జరగలేదు. అయితే శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు ఏ క్షణంలోనైనా వెలువడవచ్చునని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. మంత్రి వర్గ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. శ్రీకృష్ణతో చర్చించిన తర్వాతనే విధివిధానాలు వెల్లడి ఉంటుందని ఆయన చెప్పారు.

కాగా, శ్రీకృష్ణ శనివారం ముంబై నుంచి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. కమిటీ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగవచ్చునని అంటున్నారు. అందువల్ల కమిటీ విధివిధానాల కోసం మరో ఐదారు రోజులు నిరీక్షించాల్సిన పరిస్థేతే ఉంది. మంత్రి వర్గ సమావేశంలో పెట్రో ధరల పెంపుపై కూడా చర్చ జరగలేదు. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం 13వ ఆర్థిక సంఘం సిఫార్సులను యధావిధిగా ఆమోదించింది. కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా పెంచాలనే ఆర్థిక సంఘం సిఫార్సులను కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆర్థిక సంఘం సిఫార్సులను, ఆర్థిక సర్వేలను కేంద్రం ఈ నెల 25వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X