వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడికి కెసిఆర్ బాధ్యత వహించాలి: శ్రీధర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్: తనపై దాడికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బాధ్యత వహించాలని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వరంగల్ జిల్లాలో తనపై జరిగిన దాడికి తెరాస నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక వైపు సమిష్టి నిర్ణయాలు తీసుకుంటామంటూ మరో వైపు దాడులు చేయిస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తనపై దాడిలో 11 మంది తెరాస కార్యకర్తలు పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. దాడులతో భయపెట్టి తమను దారిలోకి తెచ్చుకోవాలని చూస్తే సహించేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కొందరు స్వలాభం కోసం, రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు నాయకులంతా సమిష్టి నిర్ణయంతో ముందుకు సాగుతారని, తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తెలంగాణ సాధిస్తామని ఆయన చెప్పారు.

కాగా, శ్రీధర్ బాబుపై జరిగిన దాడితో తమ పార్టీకి సంబంధం లేదని తెరాస శాననసభ్యుడు కెటి రామారావు అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే మంత్రులు కూడా పని చేయాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఐపియల్ రాష్ట్రం నుంచి తరలిపోవడం వల్ల బాధ ఏమీ లేదని ఆయన అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదని, తాము కమిటీని గుర్తించడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు భ్రమల్లో ఉన్నారని ఆయన అన్నారు. కమిటీనే తాము గుర్తించనప్పుడు అది ఏదో ఒరగబెడుతుందని మాట్లాడడం కూడా అనవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X