సమన్వయానికి కోదండరామ్ ప్రయత్నాలు

Kodandaram
హైదరాబాద్: రాజకీయ పార్టీల తెలంగాణ నాయకుల మధ్య సమన్వయం కోసం తెలంగాణ జెఎసి కన్వీనర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ తాము రాజీనామాలు చేస్తామని, ఎవరు వచ్చినా రాకున్నా జెఎసితో సంబంధం లేకుండా తాము రాజీనామాలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన ప్రకటన విభేదాలకు దారి తీసింది. కెసిఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం తెలంగాణ నాయకులు విమర్సించారు. మరో వైపు, కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. ఏం చేయాలనే విషయంపై వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ స్థితిలో జెఎసిని పటిష్టంగా ఉంచేందుకు కోదండరామ్ రంగంలోకి దిగారు.

శుక్రవారం సాయంత్రం ఆయన కెసిఆర్ తో సమావేశమయ్యారు. మరోసారి శనివారం ఉదయం కూడా కెసిఆర్ తో సమావేశమయ్యారు. రాజీనామాల నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన తెరాసను కోరారు. దాంతో రాజీనామాల నిర్ణయాన్ని తెరాస రేపటికి వాయిదా వేసుకుంది. రేపు ఉదయం పదకొండున్నర గంటలకు తెరాస శాసనసభ్యులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అపాయింట్ మెంటు తీసుకున్నారు. అలాగే, శుక్రవారం సాయంత్రమే కోదండరామ్ తెలుగుదేశం తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు.

శనివారం ఉదయం కోదండరామ్ బిజెపి అధ్యక్షుడు బండారు దత్తాత్రేయతో సమావేశమయ్యారు. కాంగ్రెసు తెలంగాణ నాయకులను కూడా కలుపుకుని వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జెఎసిలోనే కలిసికట్టుగా నిర్ణయం తీసుకుందామని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జెఎసి సమావేశం ఎప్పుడైనా జరగవచ్చునని, జెఎసి తర్వాతనే తదుపరి కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రజారాజ్యం శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+