సీమాంధ్ర వర్సిటీల జెఎసి సమావేశం నేడు

అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు గురజాడ కళాక్షేత్రంలో విద్యార్థి సదస్సు ప్రారంభమవుతుంది. రెండు గంటల పాటు ఇది జరుగుతుంది. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు తరలి రానున్నారు. వీరేకాకుండా సమైక్యాంధ్ర అనుకూలవాదులూ హాజరవుతున్నారు. సమైక్యాంధ్ర భవిష్యత్తు ప్రణాళిక, ఉద్యమం బలోపేతానికి అవ సరమైన శక్తుల సమీకరణ వంటి అంశాలను ఈ సదస్సులో చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. సమైక్యాంధ్ర ఆవ శ్యకతపై గళం విప్పనున్న ఈ సదస్సుకు పోలీసులు భద్రతా చర్యలు తీసుకొంటున్నారు.












Click it and Unblock the Notifications