పుణె బాంబు పేలుడు కేసు: నలుగురు అరెస్ట్

అరెస్టయిన నిందితుల్లో ఇద్దరు..ఐఎం ముఖ్యనేత రియాజ్ భత్కల్, నకిలీనోట్ల చలామణిలో కింగ్గా పిలిచే షబ్బీర్ గంగావలీ అనుచరులని సమాచారం. భత్కల్ 2005-08 మధ్యకాలంలో పుణెలో ఉన్నప్పుడు కుదల్ వాడీ చిఖ్లీ ప్రాంతానికి చెందిన ఓ తుక్కువ్యాపారి వద్ద పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగావలీ అనుచరుడ్ని జన్ వాడీ ప్రాంతంలో అరెస్టు చేశారు. కుదల్వాడీలో అనుమానిత వ్యక్తులకు ఆర్డీఎక్స్ చేరవేసినట్లు గంగావలీ అనుచరుడు అంగీకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. భత్కల్ అనుచరుడే జర్మన్ బేకరీలో పేలుడు పదార్థం ఉన్న బ్యాగును విడిచిపెట్టినట్లు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా వారి పాత్ర నిర్ధారణ కానుంది. మరోవైపు పుణె పేలుడుకు తామే కారణమంటూ పాక్ కు చెందిన 'లష్కరే తోయిబా అల్ అలామీ' అనే ఉగ్రవాద సంస్థ పేర్కొంది. ఈ పేరుతో ఒక ఉగ్రవాద సంస్థ ఉన్నట్లు ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.












Click it and Unblock the Notifications