ఉల్లంఘనల వల్లనే రోడ్డెక్కారు: అక్బురుద్దీన్

Akbaruddin
హైదరాబాద్: తెలంగాణ సీమాంధ్రకు తరలించడ వల్ల, తెలంగాణ కోసం జరిగిన ఒప్పందాల ఉల్లంఘనల వల్ల తెలంగాణ ప్రజలు ఇప్పుడు రోడ్డెక్కారని మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీల నాయకుల వల్లనే ప్రస్తుత గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. హైదరాబాదులోని ఇతర ప్రాంతాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ఆయన శుక్రవారం శాసనసభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాల వల్ల రాష్ట్రానికి 20 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, దీనికి రాజకీయ పార్టీల నేతలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు తరలిపోయాయని ఆయన అన్నారు. ఒక్క ప్రకటనతో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేతులు దులుపుకున్నారని, రాష్ట్రంలోని ప్రస్తుత గందరగోళం వల్ల ప్రజలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారా, ఆంధ్రప్రదేశ్ ను కొనసాగిస్తారా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలు బాధ్యులు కారని, ఈ మూడు ప్రాంతాల నేతలే బాధ్యులని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేదా అనే సందేహం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని ఆయన అన్నారు. తాను మొదట భారతీయుడినని, ప్రాంతాలవారీగా దేశాన్ని విభజించడాన్ని తాను అంగీకరించబోనని ఆయన అన్నారు. ప్రతి భారతీయుడు దేశంలో ఎక్కడైనా ఉండవచ్చునని, ఎక్కడికైనా వెళ్లవచ్చునని, ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. మూడు తరాల నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు తెలంగాణలో ఉంటున్నారని, ఇక్కడే ఉంటారని, అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములేనని ఆయన అన్నారు. వారిని సెటిలర్లు అనడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+