ఎరువుల కంపెనీలపై విచారణ: రఘువీరా

మంత్రి హామీతో తెలుగుదేశం సభ్యులు సంతృప్తి చెందలేదు. సభా సంఘం వేయాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను మూడోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు రెండుసార్లు కూడా సభను డిప్యూటీ స్పీకర్ రెండు సార్లు వాయిదా వేశారు. మొదటి సారి యూరియా ధరల పెంపుపై సభను పది నిమిషాలు వాయిదా వేశారు. రెండో సారి కడప మార్క్ ఫెడ్ కుంభకోణంపై గందరగోళం చెలరేగడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications