వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎరువుల కంపెనీలపై విచారణ: రఘువీరా

By Pratap
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన కడప ఎరువు ఫ్యాక్టరీతో సహా రాష్ట్రంలోని 13 ఎరువుల కంపెనీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. కడప మార్క్ ఫెడ్ ఎరువుల కుంభకోణంపై శుక్రవారం శాసనసభలో తీవ్ర గందరగోళం చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ విషయం చెప్పారు. అధికార కాంగ్రెసు సభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డితో పాటు తెలుగుదేశం సభ్యులు కడప మార్క్ ఫెడ్ అక్రమాలపై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. మంత్రి అందుకు అంగీకరించకుండా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి హామీతో తెలుగుదేశం సభ్యులు సంతృప్తి చెందలేదు. సభా సంఘం వేయాలని పట్టుబడుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను మూడోసారి పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు రెండుసార్లు కూడా సభను డిప్యూటీ స్పీకర్ రెండు సార్లు వాయిదా వేశారు. మొదటి సారి యూరియా ధరల పెంపుపై సభను పది నిమిషాలు వాయిదా వేశారు. రెండో సారి కడప మార్క్ ఫెడ్ కుంభకోణంపై గందరగోళం చెలరేగడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X