కెసిఆర్ తప్పులే చేస్తున్నారు: విహెచ్

సమైక్యాంధ్రవాదులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నారని, తెలంగాణవారు కూడా తమ వాదనలను గట్టిగా వినిపించడానికి సిద్ధం కావాలని ఆయన అన్నారు. కమిటీ వల్ల తప్పకుండా తెలంగాణకు న్యాయం జరుగుతుందని, గడువులోగానే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు వినిపించాల్సిన వాదనల గురించి ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో, సోదాహరణంగా కమిటీకి వినిపించవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణవాళ్లమంతా ఒక్క మాటగా కమిటీకి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వినిపిద్దామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జరిగిన ఒప్పందాలన్నీ ఉల్లంఘనలకు గురయ్యాయని, ఆ విషయాలను కమిటీకి వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications