వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్ రాజు గుడికి వివి వినాయక్ శ్రమదానం

By Santaram
|
Google Oneindia TeluguNews

VV Vinayak
నిజామాబాద్‌: నిజామాబాద్ మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఆదివారం పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు 'మా పల్లె చారిటబుల్‌ ట్రస్టు' ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రస్టు ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ధ్వజస్తంభ నిర్మాణానికి వీరు శ్రమదానం చేశారు.

కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సినీ దర్శకులు వివి వినాయక్‌, దశరథ్‌, 'మా పల్లె చారిటబుల్‌ ట్రస్టు' చైర్మన్‌, సినీ నిర్మాత దిల్‌రాజు, బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీటీసీ సభ్యుడు కె మోహన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ మానాల మోహన్‌రెడ్డి, ట్రస్టు వ్యవస్థాపకుడు వి.నరసింహారెడ్డి, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

తన సొంత గ్రామంలో ఆలయ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యం కావాలని నిర్మాత దిల్‌ రాజు ఆహ్వానం మేరకు దర్శకులు వివి వినాయక్‌, దశరథ్‌ లు నర్సింగ్‌ పల్లికి వచ్చారు. ఆదివారం ఆలయ ధ్వజస్తంభం నిర్మాణ పనులను వారు శ్రమదానంతో చేపట్టారు. వీరితో పాటు బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ శ్రమదానం చేశారు. ముందుగా ఆలయంలో పూజలు చేసి కార్యక్రమాలు చేపట్టారు.

వివి వినాయక్‌, దశరథ్‌ లు మాట్లాడుతూ మా పల్లె చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, తమకు పాల్గొనే అవకాశం లభించినందుకు సంతృప్తికరంగా ఉందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X