మమతా బడ్జెట్ పై కెసిఆర్ నిప్పులు

వరంగల్ జిల్లాలోని ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని తాము అడుగుతుంటే మమతా బెనర్జీ దాన్ని పశ్చిమ బెంగాల్ కు తరలించుకుపోయారని ఆయన అన్నారు. గతంలో సికింద్రాబాదుకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తే అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాన్ని బీహార్ కు తరలించుకుపోయారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మొండి చేయే చూపుతున్నారని ఆయన విమర్శించారు. సికింద్రాబాదులో ఉన్నది రైల్వే కోచ్ ల వర్క్ షాపు అని, దాన్ని ఇప్పటికే సగం మూసేశారని, ఇప్పుడు దాన్ని పునరుద్ధరిస్తామంటున్నారని, అది కూడా వ్యాగన్ల ఫ్యాక్టరీ కాదని, కేంద్రం మాత్రమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications