కాంగ్రెసు నట్టేట ముంచింది: కోదండరామ్

రాజీనామాలు చేయాలని జెఎసి ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను సమావేశంలో డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు రాజీనామాలు చేస్తే కాంగ్రెసువారిపై ఒత్తిడి పెంచడానికి వీలవుతుందని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీలు రాజీనామాలు చేస్తే 52 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, దీని ద్వారా రాజ్యాంగ సంక్షోభం కాకపోయినా రాజకీయ సంక్షోభం సృష్టించవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే జెఎసి గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాజీనామాలకు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను ఒప్పించాలని తెలుగుదేశం ప్రతినిధులు చెప్పారు. తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని వారు చెప్పారు. కాంగ్రెసు రాజీనామాలు చేయకుండా తాము చేస్తే ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని, రాజకీయ సంక్షోభం ఏర్పడదని, దాని వల్ల ఫలితం ఉండదని వారన్నారు.












Click it and Unblock the Notifications