వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో రెచ్చిపోయిన రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: శాసనసభలో ముఖ్యమంత్రి కె. రోశయ్య తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నరసింహులుపై రెచ్చిపోయారు. తెలుగుదేశం సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బిసీ ఉపకారవేతనాలు, ఫీజుల రీయెంబర్స్ మెంట్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై తక్షణమే చర్చకు అనుమతించాలని తెలుగుదేశం సభ్యులు బుధవారం ఉదయం శాసనసభలో పట్టుబట్టారు. తెలుగుదేశం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయినా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకుని తెలుగుదేశం సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నువ్వు శుభ్రంగా తిని వచ్చావు కదా అని నరసింహులును ఉద్దేశించి అన్నారు. దీనిపై నరసింహులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. విద్యార్థులు అన్నం తినొద్దా అని నరసింహులు అంటే తాను మీరు తినొచ్చారు కదా అన్నానని, అందులో తప్పేముందని రోశయ్య అన్నారు. సమస్యను తాము తిరస్కరించడం లేదని, ఎస్సీ,ఎస్టీ, బిసీ ఉపకారవేతనాలు, ఫీజుల రీయంబర్స్ మెంటు విషయంలో ప్రభుత్వం తగిన రీతిలో వ్యవరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతిచ్చారో కూడా చెప్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి నటించాలని తప్ప సమస్యపై చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు దానిపై మాట్లాడవచ్చునని ఆయన సూచించారు. తమకే సానుభూతి ఉందనే పద్ధతిలో తెలుగుదేశం సభ్యులు వ్యవహరించడం సముచితం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X