విద్యుత్తుపై రగడ: టిడిపి వాకౌట్

Telugudesam
హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్తు, వ్యవసాయ కరెంటు కనెక్షన్లపై బుధవారం శాసనసభలో తీవ్ర రగడ జరిగింది. రైతులకు రోజుకు 9 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని కాంగ్రెసు ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై తెలుగుదేశం సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరాపై ప్రభుత్వం మాట తప్పిందని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా నిరసించారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు విద్యుత్తును సరఫరా చేయాలని చంద్రబాబు కోరారు. వ్యవసాయానికి రోజుకు 9 గంటల పాటు విద్యుత్తును ఇస్తామని కాంగ్రెసు పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+