తెలంగాణ నేతలతో చంద్రబాబు మథనం

శ్రీకృష్ణ కమిటీకి చెప్పాల్సిన అభిప్రాయంపై, సమర్పించాల్సిన నివేదికపై ఆయన తెలంగాణ నాయకులతో చర్చలు జరిపారు. నెలలోగా రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలు తమ వైఖరిని కమిటీ ముందు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి చంద్రబాబు పూర్తిగా కట్టుబడే పరిస్థితి లేదు. ఆ నిర్ణయాన్ని పార్టీ సీమాంధ్ర నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇటు తెలంగాణకు వ్యతిరేకంగా కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించే పరిస్థితిలో చంద్రబాబు లేరు. రెండు ప్రాంతాలు తనకు రెండు కళ్లు అంటూ తప్పించుకోవడానికి వీలు లేకుండా శ్రీకృష్ణ కమిటీ మెలిక పెట్టింది. దీంతో చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు మొదలు పెట్టారని భావించవచ్చు.












Click it and Unblock the Notifications