రాష్ట్ర స్థితిపై పిఎంకు నరసింహన్ నివేదిక

కేంద్ర మంత్రి బన్సల్ ను కూడా ఆయన కలుసుకున్నారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన బన్సల్ ను కోరినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం నరసింహన్ ఢిల్లీ వచ్చారు. రాష్ట్ర స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ హైదరాబాదుకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ప్రధానితో నరసింహన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. గవర్నర్ మరింత మందిని కలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications