నివేదికను అధిష్టానమే చూసుకుంటుంది: డిఎస్

కాగా, తెలంగాణపై తమ పార్టీకి స్పష్టత ఉందని కాంగ్రెసు తెలంగాణ కార్యాచరణ కమిటీ చైర్మన్, శాసనసభ్యుడు బస్వరాజు సారయ్య అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి తమ పార్టీ తెలంగాణకు అనుకూలమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందనే ఆశాభావం తమకు ఉందని ఆయన గురువారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీ నాయకత్వం తెంలగాణకు అనుకూలంగా ఉంది కాబట్టే డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన వచ్చిందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తాము 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టే ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications