బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రచ్చ

సమైక్యవాదులు ఎంతగా వ్యతిరేకించినా బొత్స సత్యనారాయణ మాత్రం తన మాటను వెనక్కి తీసుకోవడం లేదు. రాష్ట్ర విభజన జరిగితేనే మంచిదని ఆయన పదే పదే అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రం విడిపోవడం వల్ల కలిగే నష్టమేమిటో విద్యార్థులు వివరించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అత్యంత కీలరమైన ప్రస్తుత సందర్భంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు సమైక్యవాదులను ఇరకాటంలో పడ్డాయి. కాగా, తెలంగాణ నాయకులంతా బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే బొత్సకు సన్మానం చేస్తామని అంటున్నారు. ఉస్మానియా విద్యార్థులు బొత్స సత్యనారాయణకు ఫొటోకు పూలదండలు వేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications