వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాములమ్మ తెలంగాణ గేమ్ ప్లాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దోబూచలాడుతున్నాయని, తెలంగాణను మోసం చేయడానికి కాంగ్రెసు మరోసారి సిద్ధపడిందని ఆమె అన్నారు. ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధికి ఆమె సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజీనామాల విషయంలో ఒక్కటి తలిస్తే మరోటి జరిగిందని, రాజీనామాల ద్వారా రాజకీయ సంక్షోభం సృష్టిద్దామని భావిస్తే ఉప ఎన్నికలు వస్తున్నాయని ఆమె అన్నారు.

శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దించుతామనే కాంగ్రెసు అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రకటనను ఆమె వ్యతిరేకించారు. కాంగ్రెసును చూసి తాము పోటీకి దిగుతామని తెలుగుదేశం పార్టీ అనడం సరైంది కాదని ఆమె అన్నారు. తెలంగాణ విషయంలో ఆ రెండు పార్టీలు కూడా మోసానికి పాల్పడుతున్నాయని ఆమె విమర్శించారు. తెరాసను ఓడించడానికి ఆ రెండు పార్టీలు సిద్ధపడుతున్నాయని, ఆ పార్టీలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆమె అన్నారు.

రాష్ట్ర విభజన మంచిదేనన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనను ఆమె ఆహ్వానించారు. ఆలస్యంగానైనా బొత్స మంచి ప్రకటన చేశారని ఆమె అన్నారు. మిగతా సీమాంధ్ర నాయకులు కూడా బొత్స మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X