గ్రేటర్ దిశగా వరంగల్, జనాభా 11 లక్షలు

నగర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేసేందుకు మంగళవారం కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ అంశాన్ని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖలతో పాటు, వివిధ సంస్థలు, సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు, అసరాలు తదితర అంశాలు చర్చకు వస్తాయి. ఉదయం మేయర్, కార్పొరేటర్లు, అధికారులతో ఏఎస్ సీఐయూజీ ప్రతినిధులు సమావేశమవుతారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇతర ప్రభుత్వ శాఖల అ«ధికారులు, ప్రతినిధులతో సమావేశమై చర్చిస్తారు. నెల రోజుల తర్వాత మరోసారి సమావేశమై సమగ్రంగా చర్చించే విధంగా కార్యక్రమాన్ని రూపొం దిస్తారు. ఈ మేరకు అవసరమైన నివేదికను రూపొందించడంలో సిటీప్లానర్ విద్యుల్లత, ఇతర అధికారులు నిమగ్నమయ్యారు.












Click it and Unblock the Notifications