వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ జిల్లాలో 6గురు హైదరాబాదీల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalgonda Dist
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు - పెద్ద కాపర్తి మధ్య తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో పాటు ఆరుగురు మరణించారు. మృతులు హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందినవారు.

హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 16 మంది కృష్ణా జిల్లా అవనిగడ్డలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X