నల్లగొండ జిల్లాలో 6గురు హైదరాబాదీల మృతి

హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 16 మంది కృష్ణా జిల్లా అవనిగడ్డలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతదేహాలను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.












Click it and Unblock the Notifications