హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య గాలికి వదిలేశారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రకాశం జిల్లా చీమకుర్తి హంస గ్రానైట్ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంపై మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి రోశయ్య దాన్ని గాలికి వదిలేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హంస గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా మృతదేహాలని ఇప్పటికీ వెలికి తీయలేకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. క్వారీ ప్రమాదానికి మైనింగ్ భద్రతా ధికారులే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

ప్రభుత్వ అసమర్థత వల్లనే చీమకుర్తి ప్రమాదంలో సహాయక చర్యలు ఇప్పటికీ పూర్తి కాలేదని ఆయన అన్నారు. అధికార యంత్రాంగం సమర్థంగా ఉన్నా దాన్ని నడిపించే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆయన అన్నారు. మంత్రులు శాసనసభను అషామాషీగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. శాఖాపరంగా కనీస సమాచారం కూడా లేని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఎంతగా బాధపడ్డామో చీమకుర్తి ప్రమాదంలో కార్మికులు మరణించినప్పుడు అంతే బాధపడుతున్నామని, చీమకుర్తి కార్మికుల మృతిపై కూడా ప్రభుత్వం తగిన స్పందించాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X