బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ టీవీ విలేకరి అరెస్టు
రెండు వారాల క్రితం కంకిపాడులోని ఓ ప్రైవేటు స్కూలు ప్రధానోపాధ్యాయురాలికి నాంచారయ్య ఫోన్ చేసి 'మీ పాఠశాలలో తగిన వసతులు లేవు, 'ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులు వస్తున్నాయి', 'టీవీలో స్క్రోలింగ్ ఇవ్వమంటారా', 'మీ స్కూలును అల్లరి చేయమంటారా?', 'స్క్రోలింగ్ రాకుండా ఉండాలంటే మాకు కొంత సొమ్ము ఇవ్వాలి', 'లేదంటే వచ్చే ఏడాది మీ స్కూలులో ఎవరూ చేరకుండా చేస్తా' అని బెదిరించాడు. భయపడిన ప్రధానోపాధ్యాయురాలు అతనికి రూ. మూడు వేలు ఇచ్చారు.
సోమవారం మళ్లీ ఆ ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్ చేసి తనకు డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. అతని తీరుపై అనుమానం వచ్చిన ఆమె స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సలహా మేరకు ఆమె నాంచారయ్యకు ఫోన్ చేసి కావాల్సిన డబ్బులు ఇస్తాను, పోరంకిలోని తమ ఇంటికి వచ్చి తీసుకోవాలని చెప్పారు. మధ్నాహ్నం రెండు గంటల సమయంలో ప్రధానోపాధ్యాయురాలి ఇంటికి చేరుకున్న నాంచారయ్య డబ్బుల కోసం దబాయించడంతో అక్కడే ఉన్న పోలీసులు నింది తుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తమదైన శైలిలో విచారణ చేయగా గతంలో చేసిన మోసాలను కూడా వెళ్లగక్కాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.