కెసిఆర్ కన్నా డిఎస్ గొప్ప: ఎమ్మెల్యేలు

పిసిసి అధ్యక్షుడైన తర్వాత తాను ప్రథమంగా తెలంగాణవాదినని స్పష్టంగా ప్రకటించుకున్నారని ఆయన గుర్తు చేశారు. పార్టీని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తక్కువగా మాట్లాడి డిఎస్ ఎక్కువగా పని చేస్తారని, తెలంగాణ కోసం డిఎస్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. తెలంగాణవాదాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ డిఎస్ సమర్థంగా వినిపించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను డిఎస్ అధిష్టానానికి సమర్థంగా వినిపించారని ఆయన అన్నారు. డిఎస్ ను ఎవరు కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన తెలంగాణ నాయకులకు, విద్యార్థులకు, మేధావులకు విజ్ఝప్తి చేశారు. శ్రీకృష్ణ కమిటీ ముందు ప్రజలెవరైనా తమ అభిప్రాయాలను వినిపించవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications