వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలంగాణ ధూంధాం

By Santaram
|
Google Oneindia TeluguNews

Telangana
మెదక్‌: అమెరికాలోని బ్లూమింగ్‌టన్‌ ప్రాంతంలో తెలంగాణ నైస్‌ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ ధూంధాం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయిన్‌పల్లి సర్పంచ్‌ అంజాగౌడ్‌ హాజరు కాగా, కరీంనగర్‌ జిల్లాకు చెందిన రాఘవరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలంగాణ అమరులకు జోహార్లు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి అమర వీరులకు సంతా పం తెలిపారు.

అమెరికాలో ఉంటున్న తెలంగాణవాసులు సుమారు 200 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీరాం మాట్లాడుతూ ఆంధ్రవారి పాలనలో తెలంగాణ ప్రాం తంలో సాగునీటి దోపిడీ జరుగుతున్న విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. అలాగే విద్య, వైద్య రంగాలతోపాటు తెలంగాణకు ఆంధ్ర పాలకులు అన్ని రంగాల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లాకు చెం దిన పూల్‌సింగ్‌, రమేశ్‌చల్లా తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X