హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణవాదం వినిపిస్తాం: గీతారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Geetha Reddy
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తామని మంత్రి గీతారెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్ెరసు నేతలుగా తమ తరఫున వినిపించాల్సిన వాదనలపై తాము చర్చలు జరిపినట్లు ఆమె చెప్పారు. గీతారెడ్డి నివాసంలో తెలంగాణకు చెందిన మంత్రులు మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు. ఎల్లుండి మరోమారు తాము సమావేశమై చర్చలు జరుపుతామని ఆమె సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ కాంగ్రెసు కార్యకర్తల మనోభావాలను కమిటీ ముందుకు తీసుకుపోతామని ఆమె అన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యకు సరైన పరిష్కారం లభించాలన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను శ్రీధర్ బాబు మరోసారి స్వాగతించారు. మిగతా సీమాంధ్ర నాయకులు కూడా బొత్స దారిలో నడవాలని ఆయన కోరారు. ఏ అంశమూ వదలకుండా తమ వాదనను వినిపించడానికి తగిన విధంగా అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీపరంగా తమ అభిప్రాయాలను కమిటీ ముందు చెప్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X