హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెట్టుబడుల ఆకర్షణలో ముందున్నాం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడోస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఏరో స్పేస్ ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్ ల్లో) పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ఆయన చెప్పారు. ఇండియా ఏవియేషన్ 2010 రెండవ అంతర్జాతీయ ప్రదర్శనను ఆయన బుధవారం హైదరాబాదులోని బేగంపేటలో ప్రారంభించారు. 2012 నాటికి అనంతపురంలో లేపాక్షి ఏరోస్పేస్ తొలి దశ పనులు పూర్తవుతాయని ఆయన చెప్పారు. వేయి కోట్ల రూపాయలతో హెలికాప్టర్ విడి భాగాల తయారీ ప్రాజెక్టు తుది దశలో ఉందని చెప్పారు. వచ్చే ఏడాది హెలికాప్టర్ విడిభాగాల ఉత్పత్తిని టాటా సంసత్ ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.

టాటాతో జరిగిన ఒప్పందం ప్రకారం నవంబర్ లో తొలి హెలికాప్టర్ క్యాబిన్ డెలివరీ ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కర్నూలు, తాడేపల్లి గూడెం, నిజామాబాద్ ల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X