వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ ను ప్రేమిస్తా, కానీ..: హుస్సేన్

By Pratap
|
Google Oneindia TeluguNews

MF Husain
న్యూఢిల్లీ: తనకు ఖాతర్ పౌరసత్వం లభించడంపై ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తొలిసారి మౌనం వీడారు. తాను భారత్ ను ప్రేమిస్తానని, అయితే భారత్ కు తాను అక్కర్లేదని, తాను ఎంతో బాధతో ఈ మాటలంటున్నానని ఆయన అన్నారు. కేరళకు చెందిన మాధ్యమం దోహా దినపత్రిక ఎడిషన్ గల్ఫ్ మాధ్యమానికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్ తన మాతృదేశమని, మాతృద్వేషాన్ని ద్వేషించలేనని, కానీ భారత్ తనను తిరస్కరించిందని, అలాంటప్పుడు తాను భారత్ లో ఎందుకుండాలని ఆయన అన్నారు.

సంఘ్ పరివార్ తనను లక్ష్యంగా ఎంచుకున్నప్పుడు అందరూ మౌనం వహించారని, రాజకీయ నాయకులు, కళాకారులు, మేధావులు ఎవరూ తనకు మద్దతుగా నిలబడలేదని, కానీ 90 శాతం మంది భారత ప్రజలు తనను ప్రేమిస్తారని తనకు తెలుసునని, వారు తనతో ఉన్నారని ఆయన అన్నారు. కొందరు రాజకీయ నాయకులతో పాటు పది శాతం మంది మాత్రమే తనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.

భారత ప్రభుత్వాలు తనకు రక్షణ కల్పించలేకపోయాయని, అందువల్ల తాను దేశంలో ఉండలేకపోయానని, రాజకీయ నాయకుల దృష్టంతా ఓట్లపైనే ఉందని ఆయన అన్నారు. ఇప్పుడు వెనక్కి రావాలని తనను అడుగుతున్నారని, తనపై దేశబహిష్కరణ ఉన్నప్పుడు ఎవరూ తనకు మద్దతుగా మాట్లాడలేదని, రాజకీయ నాయకుల మాటలను నమ్మలేమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X