బొత్సను సిఎం చేయండి: దామోదర్ రెడ్డి

R Damodar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు మద్దతు పలికిన మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన తాము స్వాగతించి, మద్దతిస్తామని కాంగ్రెస్ శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రోశయ్య తెలంగాణ వ్యతిరేకి అని, రోశయ్య స్థానంలో బొత్సను సీఎంను చేస్తే మాకు ఆమోదమేనని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకూ బొత్స ఆ పదవిలో ఉండవచ్చునని, విభజనకు మద్దతిచ్చే ఆంధ్రనేతలు హర్షకుమార్, జోగయ్య, వసంత నాగేశ్వరరావు తదితరులు మాకు మిత్రులని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీకి డిసెంబర్ 31 వరకూ కేంద్రం గడువు విధించిందని, ఆ కమిటీ నివేదికతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు చేస్తుందని తమకు విశ్వాసం ఉందని, అప్పటికీ నిర్ణయం తీసుకోకపోతే తాము తమ దారి చూసుకుంటామని, ఈ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలంతా బయటకు వస్తారుని టీడీపీ నేతలకూ అది తప్పదని, తెలంగాణ టీడీపీ ఏర్పాటు వారికి అనివార్యమని దామోదర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం వల్లే తాము రాజీనామాలు వద్దనుకొన్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే తాను సీఎం కావాలని కోరుకోవట్లేదని, జానారెడ్డి మద్దతు అడిగితే ఇస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ జేఏసీ స్వరూపం మార్చి దానిని పార్టీల సమన్వయ సమితిగా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు దామోదర్‌రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+