రోశయ్య,బాబు తెలంగాణవారే: లగడపాటి

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె రోశయ్య, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణవారేనని, వారిద్దరికి హైదరాబాదులో ఓటు హక్కు ఉన్నందున వారు తెలంగాణవారేనని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చాక తెలంగాణవాదులు విచారిస్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబ సభ్యులను ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించాలని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ పేరుతో విద్యార్థులను, ప్రజలను రాజకీయ నాయకులు రెచ్చగొట్టడంతో ఎందరో భావావేశాలకు లోనై తమ ప్రాణాలను పోగొట్టుకున్నారన్నారు. అలాంటివారి కుటుంబ సభ్యులను రాజకీయాలకతీతంగా ఏకగ్రీవంగా ఉపఎన్నికల్లో గెలిపించడం ధర్మమని ఆయన అన్నారు. తెలంగాణలో రాజీనామాలు చేసిన 12 మంది శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఇలా చేస్తే రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాతో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఉద్యమం కోసం పదవులకు రాజీనామా చేయడం గొప్ప కాదని, ప్రాణాలు అర్పించినవారే అసలైన వీరులని, వారే అసలైన పౌరులని కొనియాడారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలంటూ మరో విడత నివేదికను శ్రీకృష్ణ కమిటీకి అందించానన్నారు. రాష్ట్ర విభజనకు తాము వంద కారణాలు చెబుతాం, సమైక్యంగా ఎందుకుండాలో ఒక్క కారణం చెప్పట్లేదన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించడానికే తాను ప్రతి వారం ఒక్కో నివేదికను కమిటీకి సమర్పిస్తానని చెప్పారు. సమైక్యాంధ్రకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, దానికి సంబంధించిన అన్ని రికార్డులను తాను కమిటీ ముందుంచుతానని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి 50 ఏళ్ల చరిత్ర ఉందనడంలో వాస్తవం లేదని, కేవలం 11 ఏళ్ల చరిత్రే ఉందన్నారు. మంత్రి బొత్స వ్యాఖ్యలను తప్పు పట్టలేనని, అది ఆయన అభిప్రాయమన్నా రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+