హైదరాబాద్ లో కమిటీ సభ్యులు: నిరసనలు

లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద కూడా కమిటీ సభ్యులకు నిరసనలు తప్ప లేదు. రిటైర్డ్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నాయకత్వంలో తెలంగాణ వాదులు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పంజగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు. శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా తెలంగాణ జిల్లాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో సింగరేణి కార్మికులు నిరసనకు దిగారు. రోడ్డుపైన ఆటాపాటా నిర్వహించారు.
హైదరాబాద్ చేరుకున్న కమిటీ సభ్యులు గురువారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ ను కలుస్తారు. ఆయన ఇచ్చే విందులో పాల్గొంటారు. రేపు శుక్రవారం ముఖ్యమంత్రి కె రోశయ్యతో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ తో భేటీ అవుతారు. తమ పర్యటనలో వారు రాజకీయ పార్టీల నాయకులతో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు.












Click it and Unblock the Notifications