హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడ్జెట్ పై చర్చకు పట్టు: అసెంబ్లీలో రభస

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శాసనసభ శుక్రవారం సమావేశమైన కొద్దిసేపటికే కార్యక్రమాలేవీ చేపట్టకుండా 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనకు దిగడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. బడ్జెట్ పై ముఖ్యమంత్రి కె రోశయ్య సమాధానం లేకుండా చర్చను ముగించడాన్ని ప్రతిపక్షాల సభ్యులు తప్పు పట్టాయి. సమయం మించి పోయినందున బడ్జెట్ పై చర్చను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ముగించారు. బడ్డెట్ పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చినట్లేనని భావించాలని ప్రకటించి ముగించారు.

ముఖ్యమంత్రి రోశయ్య సమాధానం ఇవ్వకుండా చర్చను ముగించడంపై ప్రతిపక్షాల సభ్యులు శుక్రవారం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. బడ్జెట్ పై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. టీ విరామ సమయంలో పార్టీల ఫ్లోర్ లీడర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయినా ప్రతిపక్షాలు సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో సభను వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X