హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడ్జెట్ పై చర్చ కొనసాగుతుంది: స్పీకర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: బడ్జెట్ పై చర్చను కొనసాగించాలని స్పీకర్ కె కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించారు. ఫ్లోర్ లీడర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల ఒత్తిడికి ఆయన దిగి వచ్చి ఆ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం సభ సమావేశం కాగానే బడ్జెట్ పై చర్చ కొనసాగించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సభను వాయిదా వేసి స్పీకర్ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం నిర్వహించారు. బడ్జెట్ పై చర్చను కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

బడ్జెట్ పై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించిన తర్వాత మళ్లీ చర్చను ప్రారంభించడం శాసనసభ చరిత్రలో ఇదే తొలిసారి. మహిళా బిల్లులో ఒబిసి కోటా, ముస్లిం మైనారిటీలకు కోటా ఇవ్వాలనే అంశాలను కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో చేర్చాలని మజ్లీస్ సభ్యులు గురువారం శాసనసభలో పట్టుబట్టడంతో బడ్జెట్ పై ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకుండానే స్పీకర్ చర్చను ముగించారు. బడ్జెట్ పై చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చినట్లుగానే భావించాలని ఆయన చెప్పారు. దీనిపై శుక్రవారం శాననసభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X