వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం విద్యార్థి బలవన్మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: తెలంగాణ కోసం వరంగల్ లో ఓ విద్యార్థి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారంనాడు చోటు చేసుకుంది. తెలంగాణ రాదని మనస్తాపానికి గురైన అనిల్ అనే విద్యార్థి ఇంట్లో ఉరేసుకుని మరణించాడు. అతను ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అతను ఓ స్యూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నోట్ పై జై తెలంగాణ, జైజై తెలంగాణ అంటూ రాశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతను ఉరేసుకున్నాడని తెలుస్తోంది. ఈ సంఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

తెలంగాణ రాదని మనస్తాపానికి గురువుతూ వరంగల్ జిల్లాలో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటుండడం కలరపెడుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ కోసం 300మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనధికార వర్గాల అంచనా. కాగా, 139 మంది మరణించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X