రాజకీయ చర్చలు జరగలేదు: శ్రీకృష్ణ

అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో శాశ్వత కార్యాలయం ఉండదని, ఢిల్లీలోనే శాశ్వత కార్యాలయం ఉంటుందని వికె దుగ్గల్ చెప్పారు. విచారణకు లేక్ వ్యూ, ఎంసిహెచ్ ఆర్డీ, జూబిలీహాల్ ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. ఎలక్ట్రానికి కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో హైదరాబాదులో కార్యాలయం అవసరం లేదని శ్రీకృష్ణ అన్నారు. అవసరమైతే ఇక్కడ నోడల్ అధికారి ఉఁటారని ఆయన చెప్పారు. ప్రత్యేకాంశాలపై పరిశోధనలకు కమిటీ సభ్యులు ఒక్కరు గానీ గ్రూపుగా గానీ వెళ్తారని ఆయన చెప్పారు. విధివిధానాలు స్పష్టంగా ఉన్నాయని, విధివిధానాల ద్వారా తాము విచారణ జరిపితే ఫలితం ఏం వస్తుందనేది చూడాలని ఆయన అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ మీడియా సమావేశం జరుగుతుండగా తెలంగాణ న్యాయవాదులు లేక్ వ్యూ అతిథి గృహం వద్ద ఆందోళనకు దిగారు. శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకిస్తూ వారు ఆందోళనకు దిగారు. కమిటీ గోబ్యాక్ అంటూ, జై తెలంగాణ అంటూ వారు నినాదాలు చేశారు. లేక్ వ్యూ అతిథిగృహంలోకి చొచ్చుకుపోయేందుకు న్యాయవాదులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 30 మంది న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీడియా సమావేశానంతరం శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications