తెలంగాణ ఉద్యమానికే ఫోరం: నాగం

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కార్యక్రమాల నిర్వహణకు మాత్రమే తమ పార్టీ తెలంగాణ ఫోరం పనిచేస్తుందని ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. అవసమైతే స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పార్టీ వ్యవహారాలను ఫోరం చూడబోదని, పార్టీ కార్యకలాపాలను అధిష్టానమే చూస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఫోరం పనిచేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభ్యులు సమావేశమై చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే ఫోరం పనిచేస్తుందని ఆయన చెప్పారు. తమ పార్టీ మెదక్ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా వ్యవహారంపై తాము సమావేశంలో చర్చించలేదని ఆయన చెప్పారు. ఈ వ్యవవాహారంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. శాసనసభ సభ్యులు రాజీనామా చేసిన నియోజకవర్గాల్లో అమరవీరుల కుటుంబ సభ్యులను పోటీకి దించాలనే డిమాండ్ పై అవసరమైనప్పుడు చర్చిస్తామని ఆయన చెప్పారు. రాజీనామా చేసిన తాజా మాజీ శాసనసభ్యులకు మాత్రమే తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) మద్దతిస్తుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+