హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాంతిభద్రతలపై అసెంబ్లీ గరం గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై శుక్రవారం శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో నేరాలు అదుపులో ఉన్నాయని, శాంతిభద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. రాష్ట్రంలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజా భద్రతా మండలి ఏం చేస్తుందో తెలియడం లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సజావుగా లేదని ఆయన అన్నారు. ప్రజా భద్రత మండలి వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన అన్నారు.

తెలుగుదేశం సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు నాగవైష్ణవి కేసును ప్రస్తావించారు. నాగవైష్ణవిని కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సబితా ఇంద్రా రెడ్డి తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజా భద్రతా మండలిపై విమర్శలు చేస్తున్నారని, దాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె అన్నారు. నాగవైష్ణవి కిడ్నాప్ పై కుటుంబ తగిన సమాచారం ముందుగానే ఇచ్చి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదని, ఈ వ్యవహారంలో పోలీసులు విఫలం కాలేదని ఆమె అన్నారు. సబితా ఇంద్రారెడ్డి సమాధానంపై ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ కొద్ది సేపు వాయిదా వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X