శాంతిభద్రతలపై అసెంబ్లీ గరం గరం
తెలుగుదేశం సభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు నాగవైష్ణవి కేసును ప్రస్తావించారు. నాగవైష్ణవిని కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దీన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సబితా ఇంద్రా రెడ్డి తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజా భద్రతా మండలిపై విమర్శలు చేస్తున్నారని, దాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె అన్నారు. నాగవైష్ణవి కిడ్నాప్ పై కుటుంబ తగిన సమాచారం ముందుగానే ఇచ్చి ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదని, ఈ వ్యవహారంలో పోలీసులు విఫలం కాలేదని ఆమె అన్నారు. సబితా ఇంద్రారెడ్డి సమాధానంపై ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను స్పీకర్ కొద్ది సేపు వాయిదా వేశారు.
Story first published: Friday, March 5, 2010, 13:41 [IST]