ధరల పెంపుపై కదం తొక్కిన ప్రతిపక్షాలు

సిబ్సిడీ బియ్యం కోటా పెంపు, రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పొట్టలు కొడుతున్నాయని ఆయన విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదులో కరెంట్ కోత లేకుండా చూశామని ఆయన చెప్పుకున్నారు. అక్రమ నిల్వదారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. ఉపాధి హామీ, మధ్యాహ్న భోజన పథకాలకు ప్రభుత్వం తూట్లు పొడిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు.
ఈ ధర్నా సందర్భంగా చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమయంలో న్యాయవాదులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది.












Click it and Unblock the Notifications