తెలంగాణ కోసం విలేకరి ఆత్మహత్య

"తెలంగాణ ఉద్యమం ఉధృతమైనా నేను వార్తలు రాయలేక పోతున్నాను. ఇప్పుడు వచ్చిన ఉద్యమ ఉధృతిని ఏ పార్టీ ఆపలేదు. ఎందరో విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా మేల్కొని తెలంగాణ ప్రజల కలను నిజం చేయాలి. తెలంగాణ రిపోర్టర్గా ప్రాణత్యాగం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విద్యార్థుల బలిదానాలు చూస్తుంటే ఎందుకు చనిపోతున్నారనుకునేవాడిని. కానీ, మనస్సు కలవరం చెందినప్పుడు చనిపోతారని అర్థం చేసుకున్నాను. బలిదానాలు ఆగాలంటే తెలంగాణ రావాలి. తనచావుతోనైనా నాయకులు, పార్టీలు కళ్లు తెరవాలి, తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సునీల్ సూసైడ్నోట్లో పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications