హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యుత్ సమస్య తీరుతుంది: పొన్నాల

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnala Laxmaiah
హైదరాబాద్: ఈ నెల 11వ తేదీ నుంచి విద్యుత్ సరఫరా మెరగవుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. విద్యుత్ సమస్యపై జరిగిన చర్చకు ఆయన బుధవారం శాసనసభలో సమాధానం ఇచ్చారు. డిమాండ్ కు సరిపడా విద్యుత్ ను పంపిణీ చేయడం ప్రభుత్వానికి సవాల్ గా మారిందని ఆయన అన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలన్నీ తీసుకుంటుందని ఆయన అన్నారు.

వారంలో ఒక రోజు ఇప్పటికే పరిశ్రమలకు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన చెపాపుర. మంచినీరు, సాగనీటి సమస్యలు లేకుండా చర్చలు తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థుల చదువులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేసేందేకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ప్రతిపక్షాలు విమర్సించాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంలో విద్యుత్ రంగానికి ప్రధాన పాత్ర అని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X