'జనం గుండెల్లో చిరంజీవే సిఎం'
పార్టీ కార్యకర్తలు సమస్యలను పరిష్కరించే వరకు వీర సైనికుడిలా పనిచేసి, సమస్యలను పరిష్కరించేది ఒక్క పీఆర్పీయేనని ప్రజల్లో నమ్మకం కలిగించాలని కొత్తపల్లి సూచించారు. ప్రజలకు పీఆర్పీ అండగా నిలవాలని, గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరచవలసినవసరం, కార్యకర్తలపై ఉందన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా మనందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అధికధరలు, కరెంట్కోత, ఎరువుల పెరుగుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కొత్తపల్లి విమర్శించారు. చిరంజీవి ముఖ్యమంత్రి అయితేనే పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. పార్టీ జిల్లాఅధ్యక్షుడు అశోక్గౌడ్ మాట్లాడుతూ కష్టపడి పార్టీకి సేవలందించిన ప్రతిఒక్కరికి పీఆర్పీ అండగా ఉంటుందన్నారు. జయాపజయాలు ప్రతిఒక్కరికి తప్పవని, ఒక్క ఓటమి విజయానికి నాంది అని అశోక్గౌడ్ అన్నారు. చేసిన తప్పిదాలను సరిచేసుకుని, భవిష్యత్లోని విజయాలబాటకు పునాదులు వెయ్యాలని ఆయనఅన్నారు.