హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రివర్గ విస్తరణతో జగన్ కు చెక్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించవచ్చునని అంటున్నారు. బహుశా ఆయన వచ్చేనెల 4న మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చునని అంటున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి ఆయన తన నివాసాన్ని మారుస్తున్నారు. ఇప్పటికీ మంత్రివర్గంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అనుయాయులే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పటికే కొంత మంది తమ విధేయతలను మార్చుకున్నారు. ఈ స్థితిలో విధేయతలను మార్చుకున్న సీనియర్లను కొనసాగిస్తూ కొంత మంది జూనియర్లను తొలగిస్తూ ఆయన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశాలున్నాయి.

రోశయ్య తన మంత్రివర్గంలోకి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిని, జెసి దివాకర్ రెడ్డిని, కె జానారెడ్డిని తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. శాసనసభ స్పీకర్ గా సనత్ నగర్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి నియామకం జరగవచ్చునని అంటున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మరమ్మతు పనులన్నీ శశిధర్ రెడ్డే చూస్తున్నారు. కాగా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నాయి. ఆనం బ్రదర్స్ లాంటి వారికి చెక్ పెట్టేందుకు రోశయ్య సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు రోశయ్యకు పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X