కర్నూలు: ఉగాది మహోత్సవాల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈరోజు కర్నాటక నుంచి భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు ఏరియల్ రోప్వేని నిలిపివేశారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం భ్రమరాంబదేవికి సరస్వతి అలంకారం, స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.