ఫ్రీజోన్: రాజ్యాంగాన్నైనా సవరించాలి: కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: ఫ్రీజోన్‌ అంశంపై శాసనసభలో ఏకగీవ్ర తీర్మానం ఆమోదించి వెంటనే కేంద్రప్రభుత్వానికి పంపాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో మొండిగా ఉన్న ముఖ్యమంత్రి రోశయ్యపై కాంగ్రెస్‌ తెలంగాణ శాసనసభ్యులు ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ అంశంపై త్వరలో టీఆర్‌ఎస్‌ సభ్యులు ఢిల్లీకి వెళుతున్నారని, ప్రధానమంత్రికి విజ్ఞాపన పత్రం సమర్పిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌ ఆరోజోన్‌ అన్న అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌తో ప్రయోజనం ఉండదని టీఆర్‌ఎస్‌ ఆనాడే చెప్పిందని, అదే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రుజువయిందని అన్నారు. హైదరాబాద్‌ ఆరోజోన్‌ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారని, దీనికి కట్టుబడి శాసనసభ, కేబినెట్‌ తీర్మానాలు కేంద్రానికి పంపాలని, ఈ విషయంలో అవసరమైన రాజ్యాంగ సవరణ లేదా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేయాలని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి, బుజ్జగింపు ధోరణులకు దిగితే సహించమని, తీవ్రమైన ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. గతంలో జై ఆంధ్ర ఉద్యమాన్ని తెచ్చి ముల్కీ నిబంధనలను రద్దు చేయించారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+