రోశయ్యకు చేత కాదు: చంద్రబాబు

సభను నాలుగైదు రోజులు పొడిగించి చేతనైతే ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన రోశయ్యకు సవాల్ విసిరారు. సభ నడవకుండా అధికార పక్షం చవకబారు విధానాలను అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. సభను నడపడం చేత కాక రోశయ్య ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఎదురు దాడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంగా తాము ఇంత కన్నా ఏం చేయలేమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా అధికార పక్షం చవకబారుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. అధికార పక్షం సభ్యులు సభలో కుర్ర చేష్టలకు దిగుతున్నారని ఆయన అన్నారు.
వైయస్ హయాంలో సభ ఇంతకన్నా హుందాగా నడిచేదని ఆయన అన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య హోరాహోరీ పోరు నడిచేదని ఆయన అన్నారు. గాలి జనార్జన్ రెడ్డికి చెందిన ఒఎంసి అక్రమాలను ఎండగట్టడంలో తాము విజయం సాధించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన అన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications