హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయి: చిరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: రాష్ట్రంలో జలయజ్ఞం కింది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్త నడక నడుస్తున్నాయని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి కె. రోశయ్యకు ఓ లేఖ రాశారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సత్వరమే పూర్తయ్యేలా చూడాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. గోదావరి నదిపై తెలంగాణలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడం అవసరమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X