వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మంత్రి దండు కోటిన్నర విరాళాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Dandu Sivaramaraju
గణపవరం: మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు దండు శివరామరాజు తన పేరిట ఉన్న 11 ఎకరాల భూమిలో 9 ఎకరాలను వివిధ దేవస్థానాలు, మిత్రులు, తెలుగుదేశం పార్టీకి రాసి ఇస్తున్నట్లు ప్రకటించారు. గురువారం మందలపర్రు గ్రామంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బువ్వనపల్లి గ్రామంలో ఉన్న ఉమా మార్కెండేయస్వామి ఆలయానికి రెండెకరాల భూమితో పాటు ప్రతీ ఏడాది 20 వేలు అదనంగా ఇస్తానని తెలిపారు. పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలోని ఉమామార్కండేయస్వామి ఆలయానికి ఒక ఎకరం భూమి, అత్తిలిలోని వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి ఒక ఎకరం ఇస్తున్నట్టు చెప్పారు. వితరణగా ఇచ్చిన ఈ 9 ఎకరాల విలువ కోటిన్నర రూపాయలుంటుందని అంచనా.

జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఒక ఎకరం, పెదఅమిరంలో ఉన్న తన మిత్రుడు పవన్‌కుమార్‌కు ఒక ఎకరాన్ని, వాలమర్రు గ్రామంలో ఉన్న ఇందుకూరి సుబ్బరాజుకు ఒక ఎకరం భూమి రాసినట్టు చెప్పారు. మాజీమంత్రి మూర్తిరాజు దంపతులకు రెండెకరాల భూమిని రాశానని తెలిపారు. వారి తదనంతరం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం కండ్లకొయ్య గ్రామంలోని జ్ఞానానంద వృద్ధుల ఆశ్రమానికి చెందేటట్టు రాశానని చెప్పారు. జిల్లాలో పార్టీఅధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో రూ.25 లక్షలతో పార్టీ కార్యాయానికి స్వంత భవనం నిర్మించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X